కొద్ది రోజుల క్రితం నేను, నా మిత్రులు కలసి కన్నడ రాజ్యంలో ప్రసిద్దమైన బేలూరు మరియు హళేబీడు ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళటం జరిగింది. అవి హొయ్సల వంశస్తుల వారిచే నిర్మింపబడ్డ దేవాలయాలు. బేలూరులో చెన్నకేశవస్వామి వెలసుంటే హళేబీడులో ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ రెండు ఆలయాలలోను అద్భుతమైన శిల్పకళ దాగుంది. మార్గదర్శి లేకుండా ఆ శిల్పియోక్క కల్పనను అభినందించడం, హర్షించడం అసాధ్యం. మీకు పురాణ, ఇతిహాసాలపై ఏమాత్రం ఆసక్తి వున్నా ఇక్కడ మార్గదర్శి తప్పనిసరి. ఇంక, ఆ శిల్పాల విషయానికి వస్తే, పురాణ ఇతిహాస వేద ఉపనిషత్తులన్నింటినీ ఇక్కడి గోడలపై చూడవచ్చు. కొన్ని వేల సంవత్సరాలు దాటినా - మన సంస్కృతిని, ఆచార విచారాలను, కృతులను మనం కాపాడుకొని రావటానికి కారణం ఇలా భావితరాలకు భవ్య కట్టడాల ద్వారా అందించటమే. ఆ గోడలు మనకు కథలు మాత్రమే చెప్పటం లేదు, ఆ కథలను ఎంతో రమణీయంగా, కన్నులపండుగగా, మనసును రంజింపచేసేలా చెపుతున్నాయి. అన్న గారి మాటల్లో చెప్పాలంటే "ఏమి కల్పనా చాతుర్యము" అనవలసిందే!! అక్కడ నాకు బాగా నచ్చిన, సృజనాత్మకత ఉట్టిపడుతున్న కొన్ని శిల్పాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
విష్ణుపురాణంలోని దశావతారాలలో వచ్చే ఐదవ అవతారం వామన అవతారం. ముల్లోకాలను జయించి పరిపాలిస్తున్న - హిరణ్యకశిపుని వంసస్తుడు, ప్రహల్లాదుని మనవడు అయిన బలి చక్రవర్తినుంచి రక్షించాలని దేవేంద్రునితో పాటు దేవతలంతా విష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన వామన అవతారం ఎత్తి, ఇతర బ్రాహ్మణులతో కలిసి బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న స్తలానికి చేరుతారు. వచ్చింది విష్ణువేనని గ్రహించని రాజు, కోరిన వరం ప్రసాదించేందుకు అంగీకరిస్తాడు. అప్పుడు వామనుడు, తనకు మూడు అడుగుల నేల చాలునని అర్థించగా, దేవతలయొక్క మాయను అనుమానించని బలి అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు!! అప్పుడు వామన రూపంలో వున్న విష్ణువు తన మొదటి అడుగుతో దేవలోకాన్ని, రెండో అడుగుతో పాతాళాన్ని తన వశం చేసుకొని మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిని కోరతాడు. అప్పుడు వచ్చింది విష్ణువేనని గ్రహించిన రాజు ఇంక మిగిలింది భూలోకమేనని తెలిసి, మూడవ అడుగు తన తలపైన పెట్టవలసిందిగా కోరగా విష్ణువు బలి తలపై కాలు మోపి అతడిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా ఒక్క అడుగుతో దేవలోకం కొలుస్తున్న సమయంలో విష్ణువుయొక్క పాదం బ్రహ్మలోకాన్ని తాకినప్పుడు హటాత్తుగా ఆ దివ్య పదమునకు ఆతిథ్యం పొందిన బ్రహ్మ - వేదాలనే జలముగా తన కమండలంలోకి తీసుకొని భక్తితో ఆ పాదమును కడగటం మొదలు పెడతాడు. అలా కడిగిన జలమే ప్రవాహమై భూలోకానికి చేరుతుంది... ఆ దృశ్యాన్నే కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ హళేబీడులోని దేవాలయంలో గోడలపై చెక్కారు :) ఇక్కడ మీరు సూటిగా గమనిస్తే భూమికి జారుతున్న జలాన్ని గుర్తించేందుకు వీలుగా అందులో కొన్ని చేపలను, నీటి పాములను కూడా చెక్కారు!!
విష్ణుపురాణంలోని దశావతారాలలో వచ్చే ఐదవ అవతారం వామన అవతారం. ముల్లోకాలను జయించి పరిపాలిస్తున్న - హిరణ్యకశిపుని వంసస్తుడు, ప్రహల్లాదుని మనవడు అయిన బలి చక్రవర్తినుంచి రక్షించాలని దేవేంద్రునితో పాటు దేవతలంతా విష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన వామన అవతారం ఎత్తి, ఇతర బ్రాహ్మణులతో కలిసి బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న స్తలానికి చేరుతారు. వచ్చింది విష్ణువేనని గ్రహించని రాజు, కోరిన వరం ప్రసాదించేందుకు అంగీకరిస్తాడు. అప్పుడు వామనుడు, తనకు మూడు అడుగుల నేల చాలునని అర్థించగా, దేవతలయొక్క మాయను అనుమానించని బలి అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు!! అప్పుడు వామన రూపంలో వున్న విష్ణువు తన మొదటి అడుగుతో దేవలోకాన్ని, రెండో అడుగుతో పాతాళాన్ని తన వశం చేసుకొని మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిని కోరతాడు. అప్పుడు వచ్చింది విష్ణువేనని గ్రహించిన రాజు ఇంక మిగిలింది భూలోకమేనని తెలిసి, మూడవ అడుగు తన తలపైన పెట్టవలసిందిగా కోరగా విష్ణువు బలి తలపై కాలు మోపి అతడిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా ఒక్క అడుగుతో దేవలోకం కొలుస్తున్న సమయంలో విష్ణువుయొక్క పాదం బ్రహ్మలోకాన్ని తాకినప్పుడు హటాత్తుగా ఆ దివ్య పదమునకు ఆతిథ్యం పొందిన బ్రహ్మ - వేదాలనే జలముగా తన కమండలంలోకి తీసుకొని భక్తితో ఆ పాదమును కడగటం మొదలు పెడతాడు. అలా కడిగిన జలమే ప్రవాహమై భూలోకానికి చేరుతుంది... ఆ దృశ్యాన్నే కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ హళేబీడులోని దేవాలయంలో గోడలపై చెక్కారు :) ఇక్కడ మీరు సూటిగా గమనిస్తే భూమికి జారుతున్న జలాన్ని గుర్తించేందుకు వీలుగా అందులో కొన్ని చేపలను, నీటి పాములను కూడా చెక్కారు!!
దీన్నే అన్నమాచార్యుల వారు కూడా కీర్తన రూపం లో రచించారు :
బ్రహ్మ కడిగిన పాదము|
బ్రహ్మము తానెని పాదము||
చెలగి వసుధ కొలిచిన నీ పాదము|
బలి తల మోపిన పాదము|
తలకగ గగనము తన్నిన పాదము|
బలరిపు గాచిన పాదము||
మరి కొన్ని అపురూప శిల్పాలను మరొక్క పోస్టులో పరిశీలిద్దాం ..